పేజీలు

11 మార్చి 2013

తెలుగు చంధస్సు



    పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది.

గురువుని U తోనూ
లఘువుని l తోనూ సూచిస్తారు.



లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము)

హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు

ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ

హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.

ఉదా - క,చి,టు,తె,పొ

హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.

ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి

హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.

ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి

వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.

ఉదా - సృ,తృ,కృ మెదలయునవి





గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు.

దీర్ఘాలన్నీ గురువులు

ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ

ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.

ఉదా - సై,కా,తే,చీ

విసర్గతో కూడిన అక్షరములు గురువులు.

ఉదా - త:,దు:,అ:

సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు.

ఉదా - అం,కం,యం,రం

సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు

ఉదా - లక్ష్మి,పద్మ

ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు

ఉదా - అమ్మ,అక్క,పువ్వు

పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు

ఉదా - ఖ,ఘ,ఛ,ఝ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి